ప్రజాక్షేత్రంలో సమస్యలను స్వయంగా తెలుసుకున్న మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పేరుతో సాగిన మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర

Update: 2022-03-06 03:58 GMT

ప్రజాక్షేత్రంలో సమస్యలను స్వయంగా తెలుసుకున్న మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ప్రజాక్షేత్రంలో సమస్యలను తెలుసుకోడానికి కాంగ్రెస్ నాయకులు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క తలపెట్టిన పీపుల్స్ మార్చ్ వందకిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో తనదృష్టికొచ్చిన సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న భట్టి విక్రమార్క శాసనసభలో ప్రస్తావనకు తీసుకురాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రకు తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించారు. రైతు సమస్యల పరిష్కారానికి శాసనసభలో ప్రస్తావిస్తామని చెబుతున్నారు భట్టి విక్రమార్క.

Tags:    

Similar News