కాంగ్రెస్ పార్టీని వీడనున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాబాసాగా మారింది. కొందరు కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లోనే తాముంటామని వెంకట్రెడ్డి వర్గీయులు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ మారుతున్నారని తాము మాత్రం కాంగ్రెస్లోనే ఉంటామన్నారు.