ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరిన న్యాయవాది రచన రెడ్డి

* కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని ఆరోపణ * పోలింగ్‎కు వారం రోజులే గడువు.. ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం: హై కోర్టు * ఎన్నికల పిల్స్, రిట్ పిటిషన్లు డిసెంబర్ 23న విచారిస్తాం: హై కోర్టు

Update: 2020-11-25 10:53 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికలపై తాము ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని, వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని న్యాయవాది రచనారెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలింగ్‎కు వారం రోజులే గడువున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రేటర్ ఎన్నికలపై వేసిన పిల్స్, రిట్ పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామన్న కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.

Tags:    

Similar News