శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 10:38 AM IST
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్
X

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ కలకలం రేపింది. కువైట్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఫ్లైట్ 6E1234 కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ పంపడంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల కారణంగా ఆ విమానాన్ని హైదరాబాద్‌కు కాకుండా ముంబైకి డైవర్ట్ చేశారు.

విమానంలో మొత్తం 235 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేసి... విమానాన్ని స్కానింగ్ చేసి డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు చేపట్టారు. బెదిరింపు ఈమెయిల్ పై నిజమా కాదా అనే దానిపై పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story