మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
తెలంగాణ భవన్లో కార్పొరేట్, కౌన్సిలర్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సరళి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని నేతలను హెచ్చరించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెబల్ అభ్యర్థులపై ఎమ్మెల్యేతో మంత్రి కేటీఆర్ చర్చించారు. కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు.