సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత డాక్టర్లు, సిబ్బందితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆసుపత్రి పనితీరు గురించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న వైద్యం అందక గర్భిణి చనిపోవడంపై కూడా కేటీఆర్ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు. ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు.