ఆర్మీ తీరుపై రక్షణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన కేటీఆర్

కంటోన్మెంట్ ఏరియాలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని.., రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు

Update: 2019-09-18 05:35 GMT

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో వాహనాలు వెళ్లకుండా ఆర్మీ రోడ్లను మూసివేసింది. దీంతో కంటోన్మెంట్ ఏరియాలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని.., రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. ఆర్మీ తీరు అసాధారణంగా ఉందని ఆయన మండిపడ్డారు. సైన్యం రోడ్లను మూసేయడంతో స్థానికుల ఇబ్బందిపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్య త్వరగతిన పరిష్కారమయ్యేలా చూడాలని... ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు రక్షణ శాఖ దృష్టికి తీసుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు. 

Tags:    

Similar News