కంటతడిపెట్టిన కర్నాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్..

Update: 2019-07-29 10:37 GMT

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల కర్నాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తూ...ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్‌ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. జైపాల్‌రెడ్డి అన్నలాంటి వారని చెబుతూ దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. 1980 నుంచి జైపాల్ రెడ్డి తెలుసు అన్నారు. వ్యక్తిగతంగా జైపాల్ రెడ్డితో దగ్గరగా ఉండే వాడినని చెప్పారు. జైపాల్ రెడ్డి గొప్ప పార్లమెంటరీయన్‌... మంచి మనస్సు ఉన్నవారన్నారు. జీవితంలో జైపాల్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం నా అదృష్టమని.. ఆయనకు వందనం చేస్తున్నానన్నారు. ఇది చాలా విషాదకరమైన రోజు అని అన్నారు కర్నాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్.

Tags:    

Similar News