Rajgopal Reddy: తాను రాజీనామా చేశాకే నియోజకవర్గానికి నిధులు కేటాయించారు

Rajgopal Reddy: కావాలనే పనిగట్టుకుని తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని ఫైర్అయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Update: 2022-08-13 13:46 GMT

Rajgopal Reddy: తాను రాజీనామా చేశాకే నియోజకవర్గానికి నిధులు కేటాయించారు

Rajgopal Reddy: కావాలనే పనిగట్టుకుని తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని ఫైర్అయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయనతన పదవికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాల్లో రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా రాత్రికి రాత్రి పోస్టర్లు వేశారు. ఈ విషయం తెలుకున్న రాజగోపాల్ రెడ్డి తనకు వ్యతిరేక పోస్టర్లపై సీరియస్ అయ్యారు. ఇదో పరికిపంద చర్య అన్న ఆయన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నాడు లేనిది.. ఇప్పుడు తాను మారితే తప్పేంటని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించాకే నియోజకవర్గానికి నిధులొచ్చాయని గుర్తు చేశారు. తాను అమ్ముడుపోయానని ఎవరి దగ్గరైనా రుజువులంటే ఎక్కడైనా చర్చకు సిద్దమని సవాలు విసిరారు. 21న అమిత్ షా ఆద్వర్యంలో జరిగే బీజేపీ సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News