తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోయింది: కోదండరాం

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘటన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజేఎస్‌ ఆఫీసులో జాతీయ జెండాను కోదండరాం ఎగురవేశారు.

Update: 2019-08-15 06:13 GMT

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘటన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజేఎస్‌ ఆఫీసులో జాతీయ జెండాను కోదండరాం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ ఉద్యమ ఆకాంక్షలను మరిచిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో చదువుకున్నవారికి ఉపాధి లేదని మండి పడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా రాస్తారోక ర్యాలీలు చేసినా కానీ అరెస్ట్‌లు చేస్తున్నారని, ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహిరిస్తున్నా తీరు సరికాదన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ద్వారా రాజకీయాలు నడపొద్దని కోదండరామ్ హితవు పలికారు. రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టకపోతే ఖచ్చితంగా నష్టపోతామని వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News