Kishan Reddy: దేశాన్ని దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
Kishan Reddy: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ గూటికి ఖమ్మం హస్తం నేతలు
Kishan Reddy: దేశాన్ని దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
Kishan Reddy: కాంగ్రెస్ పార్టీది అక్రమాల చరిత్ర అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టుపెట్టింది బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అవసరం ప్రజలకు లేదన్నారు. కాంగ్రెస్ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ... తెలంగాణ ప్రజలను సంఘటితం చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని దోపిడీ చేశాయని... అలాంటి పార్టీలతో కలవాల్సిన అవసరం బీజేపీకి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.