అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. ముగ్గురు సీఎంలకు కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2022-09-03 09:16 GMT

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. ముగ్గురు సీఎంలకు కిషన్‌రెడ్డి లేఖ

Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పాటు ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Tags:    

Similar News