ఖమ్మంలో బంద్ ఉద్రిక్తంగా సాగుతోంది. బస్టాండ్ సమీపంలో ఆగిన ఆటోలపై ఆందోళనకారులు దాడి చేశారు. ప్రయాణీకులను ఎక్కించుకుంటున్న ఆటోలను అడ్డుకున్న నిరసనకారులు దాడి చేయడంతో కొన్ని ఆటోల అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. కనీసం ఆటోల్లోనైనా తమను ప్రయాణం చేయనివ్వరా అంటూ ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కోనసాగుతోంది ఆరు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా గేట్ల వద్ద బైటాయించారు. ఖమ్మం బస్స్టాండ్ వద్ద వివిద పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.