తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం

Update: 2019-05-07 01:57 GMT

తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన.. వాడకం పోను మిగిలిన కరెంటును ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి బదులుగా సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్తును తీసుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. అందులో తెలంగాణలో ఉత్పత్తి అయిన 1000మెగావాట్ల విద్యుత్‌ను ఈ నెల 10 నుంచి జూన్‌ 25వ తేదీ దాకా ఇతర రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని.. దీనికి బదులుగా వ్యవసాయసాగుకు కీలకమైన సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో తిరిగి వారినుంచి కరెంటు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంది. 

Similar News