Harish Rao: ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సత్తా దేశానికి తెలుస్తుంది

Harish Rao: బీఆర్ఎస్‌ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదిక కానుంది

Update: 2023-01-13 11:09 GMT

Harish Rao: ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సత్తా దేశానికి తెలుస్తుంది 

Harish Rao: తెలంగాణ అంటే ఏమిటో కేసీఆర్ సత్తా ఏమిటో ఖమ్మం సభ ద్వారా దేశానికి చాటి చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. BRS పార్టీ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదికకానుందని అన్నారు. ఖమ్మంలో జరిగే సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతోందని ఢిల్లీ, కేరళ, పంజాబ్, సీఎంలతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు సభకు హాజరవుతారని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ మాటే వినిపిస్తోందని తెలంగాణ పథకాలు అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని హరీష్ రావు వెల్లడించారు.

Tags:    

Similar News