కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుపై దేవిశ్రీప్రసాద్‌పై కేసు నమోదు చేసిన సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు

*హిందువుల మనోభావాలను దేవిశ్రీ దెబ్బతీశారంటూ కరాటే కల్యాణి ఫిర్యాదు

Update: 2022-11-04 11:54 GMT

కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుపై దేవిశ్రీప్రసాద్‌పై కేసు నమోదు చేసిన సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు

Karate Kalyani: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదయ్యింది. కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుపై దేవిశ్రీప్రసాద్‌పై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ఆల్బమ్‌లో హరేరామ- హరే కృష్ణ మంత్రంపై.. అశ్లీల నృత్యాలు చేశారని హిందు సంఘాలు, కరాటే కల్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దేవిశ్రీ ప్రసాద్ దెబ్బతీశారంటూ ఫిర్యాదులో తెలిపారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు.

Tags:    

Similar News