దిశ మృతిపై కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శోభ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దిశ తన చెల్లికి ఎందుకు ఫోన్ చేసిందని, తండ్రికి ఎందుకు కాల్ చేయలేక పోయిందని ప్రశ్నించారు. దిశకు ఆమె తల్లిదండ్రులు మధ్య సఖ్యత లేదని ఆ విషయం ఆమె మాటల్లో కనిపిస్తుందని శోభ జోస్యం చెప్పారు. దిశ పేరెంట్స్ దగ్గర ధైర్యం కోల్పోయిందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, ఎంత మంది పిల్లలకు రక్షణ కల్పిస్తామని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా సంక్షేమం స్థాయి సంఘ సమావేశంలో చైర్మన్ శోభ ఈ వ్యాఖ్యలు చేశారు. శోభ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.