దిశ హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విచారణ వేగవంతం దిశగా మరో అడుగు పడింది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిచ్చింది. మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై స్పందిచిన హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ఉత్వర్తులు జారీ చేసింది.