జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు.. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతల దాడి

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు.

Update: 2025-11-11 06:23 GMT

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్త పరిస్థితులు.. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతల దాడి

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. షేక్‌పేట్‌ డివిజన్‌లో బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. బీజేపీ నేతలు బయట తిరగొద్దంటూ కాంగ్రెస్‌ నేత సాయినాథ్‌ అలియాస్‌ లడ్డూతో పాటు మరో నలుగురు కలిసి స్వస్తిక్‌పై దాడిచేశారు.

అయితే.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌.. కాంగ్రెస్‌ నేతలపై ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు.. వాలి స్కూల్లోని పోలింగ్ స్టేషన్‌ దగ్గర పోలీసులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. పెద్దఎత్తున ఏజెంట్లు గుమిగూడటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

Tags:    

Similar News