తాండూర్ లో పర్యటించిన జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు

Update: 2019-11-25 11:06 GMT
జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ మాణిక్ రావు

తాండూర్: మండలంలోని బోయపల్లి, తాండూర్, కొత్తపల్లి రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా విస్తరణలో ఇరువైపులా కోల్పోతున్న భూములను ఇంటి స్ధలాలను జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు పరీశీలించారు.

ఈ నెల 27, 28 తేదీల్లో మదనాపూర్, బోయపల్లి, తాండూర్, కొత్తపల్లి, రేపల్లివాడ గ్రామాల్లో భూసేకరణ చేస్తామని ఇరువైపులా స్థలాలు కోల్పోతున్న వారు భూ సమస్యలు ఉంటే, బోయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ ఐదు ఊర్లకు సంబంధించిన వారు రెవెన్యూ అధికారులకు పిటీషన్లు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైవే స్పేషల్ ఆఫీసర్ సత్యనారాయణ, తాండూర్ డిప్యూటీ తహసీల్దార్ మాణిక్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 




Tags:    

Similar News