తెలంగాణ బంద్‌కు జనసేన మద్దతు

Update: 2019-10-14 07:41 GMT

ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో జనసేన కార్మికులకు మద్దతుగా నిలిచింది. ఈ నెల 19న చేపట్టనున్న తెలంగాణ బంద్‌కు జనసేన మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చిందని కార్మికుల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్‌లో సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదన్నారు. 48 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆందోళన కలిగిస్తోందన్నారు. సమ్మెపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.


 

Tags:    

Similar News