ఇవాళ కోదాడలో జనసేనాని పర్యటన
*ప్రమాదంలో మరణించిన కడియం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న పవన్ కల్యాణ్
ఇవాళ కోదాడలో జనసేనాని పర్యటన
Pawan Kalyan: సూర్యాపేట జిల్లా కోదాడలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. బక్కమంతులగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కడియం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించనున్నారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు 5లక్షల రూపాయల బీమా చెక్కులు అందజేయనున్నారు. కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ పాల్గొంటారని జనసేన నేతలు తెలిపారు. పవన్ పర్యటణ నేపథ్యంలో చౌటుప్పల్, కోదాడలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.