హరీష్రావుతో గొడవలు లేవు : జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరిష్రావుతో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, అందుకే తిరిగి పట్టం కట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరిష్రావుతో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, అందుకే తిరిగి పట్టం కట్టారన్నారు. ఇక నుంచీ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ సంగారెడ్డికి వచ్చి హరీష్రావు ప్రచారం చేసుకున్నా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిపైనా జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన రేవంత్ జీరో ఎలా అయ్యారో గుర్తించాలన్నారు. అయితే గురువారం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు హరిష్రావుతో జగ్గారెడ్డి సమావేశమైనా సంగతి తెలిసిందే.