'ఆర్టీసీని అప్పుడే విలీనం చేయించేవాడిని' : జగ్గారెడ్డి

Update: 2019-10-19 10:35 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆర్టీసీ సమ్మె జరిగిదే కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో ఆర్టీసీ విలీనం అంశం తెరమీదకు వచ్చి ఉంటే తానే ఆ పని చేయించి ఉండేవాడినన్నారు. చాలి చాలని వేతనాలతో పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఈ స్ధాయిలో నిర్భందం చేయడం తగదన్నారు. తెలంగాణ వచ్చిన తరువాతే పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ ఎలా ఉండకూడదని ప్రజలు భావించారో అలాగే ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సమయాల్లో అండగా నిలవడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. 

Tags:    

Similar News