తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి..

Telangana: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా అవినాష్‌ మహంతి

Update: 2023-12-12 07:44 GMT

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి..

Telangana: కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలంగాణలో అధికారుల బదిలీలు, మార్పులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో ముగ్గురు పోలీస్ కమిషనర్లను మార్చారు డీజీపీ. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా అవినాష్‌ మహంతి.. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించింది పోలీస్ శాఖ. సైబరాబాద్, రాచకొండ సీపీలు చౌహాన్, స్టీఫెన్ రవీంద్రను డీజీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Tags:    

Similar News