2వ తరగతి విద్యార్థినిని కాటేసిన పాము
* ప్రభుత్వాస్పత్రికి తరలించిన స్థానికులు.. పామును వెతికి చంపిన గ్రామస్తులు
2వ తరగతి విద్యార్థినిని కాటేసిన పాము
Rangareddy District: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పెద్ద ఎల్కిచర్ల ప్రైమరీ స్కూల్లో పాముకాటు కలకలం రేపింది. రెండవ తరగతి చదువుతున్న బోయ అక్షిత అనే విద్యార్థినిని పాము కాటు వేసింది. దీంతో వెంటనే ద్విచక్ర వాహనంపై చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్నికి తరలించారు. అయితే అక్షితను కాటేసిన పామును వెతికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు.