Telangana: మల్లారెడ్డి క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం
రాష్ట్రంలో రోజు రోజుకు కాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.
రాష్ట్రంలో రోజు రోజుకు కాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఎంతో మందికి వైద్యం అందించాలనే ఆలోచనతో మల్లారెడ్డి కాన్సర్ ఆస్పత్రిని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో నిర్మించారు. ఈ ఆస్పత్రిని గురువారం ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్రావు, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద, సుభాష్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్రెడ్డి, కలెక్టర్ ఎం.వి.రెడ్డి, కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ డా.కరుణాకర్ రెడ్డి, ఎం.ఆర్.జీ ఐ సెక్రటరీ సి.హెచ్.మహేందర్ రెడ్డి, ఎం.ఆర్.ఐ.ఎం.ఎస్. వైస్ చైర్మన్ డా. సి.హెచ్.భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.