Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం

Amit Shah: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే

Update: 2023-11-25 07:00 GMT

Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం

Amit Shah: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పిన షా.. తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అన్నారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని, ఎంఐఎం, కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కే వెళ్తుందని చెప్పారు అమిత్‌షా.

Tags:    

Similar News