హైదరాబాద్ మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప సొసైటీ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. అతివేగం వల్ల అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.
అయితే బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్ ముందు భాగం, అద్దాలు ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది.
రోడ్డు మధ్యలో బస్సు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వచ్చి వెంటనే క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తొలగించారు.