హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు

Update: 2019-09-27 13:04 GMT

హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. మొదటి నుంచి పలువురు నేతల పేర్లు హుజూర్ నగర్ అభ్యర్థి రేసులో వినిపించినా అధిష్టానం చివరకు రామారావుకే ఓటేసింది. కాగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్లకు ఈనెల 30 వరకూ గడువు ఉంది. అక్టోబరు 21న పోలింగ్‌ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

Full View

Tags:    

Similar News