కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి ముస్తాపూర్ తండాలో స్థానికులు దీపాలను వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి పడ్డాయి. రెండు గుడిసెలకు నిప్పంటుకుని కాలిబూడిదయ్యాయి. తండాకు చెందిన సబావత్ రెడ్యా, సబావత్ బన్యాలకు చెందిన గుడిసెలలో మోదీ పిలుపు మేరకు అందరిలా కరోనాకు వ్యతిరేకంగా దీపాలను వెలిగించారు. గాలికి దీపాలు గుడిసెలకు అంటుకున్నాయి.