తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Telangana: ఈ నెల 21న మునుగోడులో అమిత్‌ షా సభ

Update: 2022-08-19 05:38 GMT

తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Telangana: తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఈ నెల 21న మునుగోడులో అమిత్‌ షా సభ ఉండనుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని అమిత్‌ షా దర్శించుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గ రైతులతో సమావేశం ఏర్పాటుకు పార్టీలో చర్చిస్తున్నారు. ఇక మునుగోడులో అమిత్‌ షా సభకు 2 లక్షల మందిని తరలించాలని బీజేపీ టార్గెట్‌‌గా పెట్టుకుంది. భారీ జనసమీకరణకు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Tags:    

Similar News