High Court: గణేష్‌ నిమజ్జనంపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం

High Court: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని ప్రభుత్వానికి సూచన

Update: 2021-08-18 11:22 GMT

గణేష్ నిమజ్జనం (ఫైల్ ఇమేజ్)

‌High Court: గణేష్‌ నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది.నిమజ్జనం వేళ జనం గుంపులుగా గుమిగూడకుండా ఏం చర్యలు చేపట్టారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలనుర నిమజ్జనం చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగింది. ఈ అంశాలపై సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ నివేదికలు సమర్పించకుంటే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. 

Full View


Tags:    

Similar News