ఆ విషయంలో మేం జోక్యంచేసుకోలేం: హైకోర్టు

Update: 2019-06-19 11:50 GMT

ఇంటర్ ఫలితాల పిటిషన్‌లపై హైకోర్టు విచారణ ముగించింది. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్న కోర్టు పరిహారం చెల్లించాలని ఆదేశించలేమని తెలిపింది. తప్పులకు బాధ్యులపై చర్యలు విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది న్యాయస్థానం. శాఖపరమైన విచారణ జరిపి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫలితాల్లో చిన్న చిన్న తప్పులే జరిగాయని అభిప్రాయ పడింది కోర్టు. ఇంటర్‌పై వేసిన పిటిషన్‌లను డిస్ మిస్ చేసింది.

Tags:    

Similar News