ఆర్టీసీ సమ్మెపై మరికొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ
♦ హైకోర్టుకు చేరుకున్న సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ♦ హైకోర్టుకు తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ సమ్మెపై మరికొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ జరుగనుంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు చేరుకున్నారు. ఆర్టీసీ సమ్మెపై పిటిషన్ విచారణ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు చేరుకున్నారు.