తెలంగాణ స్పీకర్ కు నోటీసులు

Update: 2019-06-11 08:56 GMT

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారంకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై దాఖలైన పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం స్పీకర్‌తో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యాదర్శి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. అలాగే మరో కేసులో శాసనమండలిలో సీఎల్పీ విలీనం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కూడా మండలి ఛైర్మెన్‌, కార్యదర్శి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. అలాగే టీఆర్ఎస్‌లో విలీనం అయిన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, ఆకుల లలితకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  

Tags:    

Similar News