ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో... సిట్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

* బీఎల్ సంతోష్ నోటీసులపై గతంలో హైకోర్టు స్టే... నేటితో ముగియనున్న స్టే గడువు

Update: 2022-12-05 05:26 GMT

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో... సిట్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. బీఎల్ సంతోష్ నోటీసులఫై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే గడువు నేటితో ముగిసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు నోటీసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ‌్యంలో నేడు రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపనుంది.

Tags:    

Similar News