ప్రజా సంగ్రామ యాత్రపై నేడు హైకోర్టులో విచారణ

*ఇప్పటికే సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసుల నోటీసులు

Update: 2022-08-25 03:30 GMT

ప్రజా సంగ్రామ యాత్రపై నేడు హైకోర్టులో విచారణ

TS High Court: టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. పాదయాత్ర కొనసాగిస్తే శాంతి భద్రతలకు విఘాతం కల్గుతుందంటున్నారు పోలీసులు. అంతేకాదు.. విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ ప్రసంగాలు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. అయితే వీడియోలతోపాటు యాత్రకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను సమర్పించాలంది కోర్టు. దీంతో ఇవాళ బండి సంజయ్ ప్రసంగాల వీడియోలు, కేసు వివరాలను నేడు కోర్టుకు సమర్పించనున్నారు పోలీసులు.

Tags:    

Similar News