నిజామాబాద్ లో కలకలం రేపిన హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
- ఎస్సై రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్రెడ్డి ఆత్మహత్య - ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ మధ్య విభేదాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్లో కలకలం రేగింది.ఎస్సై రివాల్వర్ తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ కేసు విషయంలో.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ మధ్య విభేదాలు రావడంతో.. ప్రకాశ్రెడ్డి కాల్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రకాశ్రెడ్డి డెడ్ బాడీని జిల్లా ఆస్పత్రికి తరలించారు.