రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది హయత్ నగర్ మిస్సింగ్ కేసు .. వారం రోజుల తరవాత ఆమె ఆచూకి లభ్యం అయ్యింది . దీనితో అందరు ఒక్కసారిగా ఉపిరి పీల్చుకున్నారు . అయితే ఆమె నిన్న ఎంజీబీఎస్లోని దేవరకొండ ఫ్లాట్ఫాం వద్ద తన స్నేహితురాలుకి కనిపించింది . ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అని తన స్నేహితురాలు ప్రశ్నించగా అసలు తనని ఎవరు కిడ్నాప్ చేయలేదని ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పడంతో ఆమె స్నేహితురాలు ఆశ్చర్యపోయింది . అ తరువాత భాదితురాలు ఇంటికి ఫోన్ చేయగా ఆమె తల్లితండ్రులు పోలిసులతో కలిసి ఎంజీబీఎస్ చేరుకున్నారు. అ తరువాత ఆమెకు వైద్య పరిక్షలు నిర్వహించారు . కిడ్నాపర్ రవిశేఖర్ అద్దంకి నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నెల్లూరు జిల్లాలోని ఓ చెక్పోస్టు వద్ద రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .