సిద్దిపేట జిల్లా కొండపాకలో... శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స పరిశోధనా కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీష్‎రావు

Harish Rao: సంస్థ పెద్దలు సద్గురుసాయి సేవా కార్యక్రమాలకు.. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తాం

Update: 2022-11-17 09:59 GMT

సిద్దిపేట జిల్లా కొండపాకలో... శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స పరిశోధనా కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీష్‎రావు

Harish Rao: ప్రార్థించే చేతుల కన్న సహాయం చేసే చేతులు మిన్న అని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండల కేంద్రమైన శ్రీసత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స,పరిశోధన కేంద్రాన్ని శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయితో కలిసి ప్రారంభించారు. అనంతర మంత్రి మాట్లాడుతూ.. చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్స కోసం కొండపాకలో సద్గురు మధుసూదన్ సాయి ఆద్వర్యంలో సంజీవని బాలల ఆస్పత్రి ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రజా శ్రేయస్సు కోరి శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయి ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహాకరాలు అందిస్తామన్నారు.

Tags:    

Similar News