ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్లో గుత్తాతో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.