క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మిత్రుడు రజినీకాంత్ చేసిన ట్యాగ్ ను స్వీకరించిన ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్
అందోల్: గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మిత్రుడు రజినీకాంత్ చేసిన ట్యాగ్ ను స్వీకరించి, సంగారెడ్డి జిల్లా అందోల్ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి, ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్ మొక్కలు నాటారు.
ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ ప్రముఖులకు మొక్కలు నాటాలని, టీఎస్ పియస్ చైర్మన్ గంట చక్రపాణి, జార్జి రెడ్డి సినిమా డైరెక్టర్ జీవన్ హరి శంకర్, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ దినేష్ దాస, ఎంపీ బిబి పాటిల్, జేసీ నిఖిల రెడ్డి, కామన్ మ్యాన్ గోరిల్లా మలైశం లకు గ్రీన్ ఛాలెంజ్ చేసారు.