కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న గవర్నర్
తెలంగాణ రెండో గవర్నర్గా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తెలంగాణ రెండో గవర్నర్గా డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారామె. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ భవన్ చేరుకుంటారు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్.. తమిళి సై చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.