మహాత్మునికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా గాంధీజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది.

Update: 2019-10-02 05:51 GMT

దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా గాంధీజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించింది. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్దనున్న మహాత్ముగాంధీకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనంలో గవర్నర్ తమిళిసై , ముఖ‌్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అంతకుముందుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గాంధీజీకి నివాలుర్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్న‎గాంధీ విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తోపాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Tags:    

Similar News