తెలంగాణ బడ్జెట్ లో ప్రజలకు తీపి కబురు..

Telangana: *సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు *బడ్జెట్ సమావేశాల్లోనే ఉద్యోగ నోటిఫికేషన్

Update: 2022-03-02 08:49 GMT

తెలంగాణ బడ్జెట్ లో ప్రజలకు తీపి కబురు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజలకు తీపి కబురు చెప్పనుంది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 5లక్షల రూపాయలు ఇచ్చేందుకు బడ్జెట్ లో కేటాయింపులు జరపనున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, సంక్షేమానికి మరో కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags:    

Similar News