GRMB Meeting: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం
GRMB Meeting: రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ
గోదావరి రివర్ మానేజిమెంట్ బోర్డు (ఫైల్ ఇమేజ్)
GRMB Meeting: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈమేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. ఆగస్టు 3న జరిగే సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులు హాజరుకావాలని లేఖలో పేర్కొంది. సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాతో రావాలని లేఖలో GRMB కోరింది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తొలిసారి GRMB సమావేశం అవుతోంది.