చిటికెలతో దెయ్యాన్ని భయపెడుతున్నాడు ఓ మతపెద్ద. చిటికెల సౌండ్కే వణికిపోతాయంటూ తెగ బిల్డప్ ఇస్తున్నాడు. దేవదూతగా అవతారమెత్తి నానా హంగామా చేసిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. హన్మకొండలోని సఖి ఉమెన్స్ కౌన్సిలింగ్ సెంటర్లో పాస్టర్ దామోదర్ హల్చల్ చేశాడు. దెయ్యాలు అమ్మాయిల శరీరంలోకి ప్రవేశించాయని వాటిని తరిమేస్తానంటూ సెంటర్లోనే మత ప్రార్ధనలు చేశారు. సేవ సంస్థ ముసుగులో మహిళలను నేలపై పడుకోబెట్టి ప్రార్ధనలు చేయడంతో పాటు చిటికెలతో దెయ్యాన్ని భయపెడుతున్నాడు. కౌన్సింగ్ సెంటర్లో పని చేస్తున్న ముగ్గురు మహిళలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కౌన్సిలింగ్ సెంటర్లో దెయ్యం వదిలించే ప్రయత్నం చేశాడు.