సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్పై GHMC అధికారులు కొరడా ఝులిపించారు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంలో అధికారులు రంగంలో దిగారు. హెల్త్ అధికారి, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటేషన్ అధికారి హోటల్ను పర్యవేక్షించారు. వంటసామాగ్రిలో, పారిశుధ్యంలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించారు. లక్ష రూపాయల జరిమాన విధించారు. జరిమాన తో పాటు నోటీస్ కూడా ఇచ్చారు. వారం రోజులలో సరిచేసుకోకపోతే హోటల్కు తాళం వేస్తామని హెచ్చరించారు.