కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల అలక

Update: 2020-11-18 08:45 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఊహించని పరిణాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు అలకబూనుతున్నారు. గతకొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ దూరంగా ఉంటున్నారు. నిన్న జరిగిన గ్రేటర్‌ ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా అంజన్‌కుమార్‌ యాదవ్ డుమ్మా కొట్టారు. బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల ఇంచార్జ్‌గా భూపేందర్‌ యాదవ్ రావడంతో కాంగ్రెస్‌లో ఉన్న యాదవ్‌లంతా బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ రాజీనామా చేశారు.

Tags:    

Similar News